Thursday 4 October 2018

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 65

వీక్షణం – బే ఏరియా సాహితీ గవాక్షం - 65


- కృష్ణమోహన్ మోచెర్ల

జనవరి 14, 2018 న కాలిఫోర్నియా లోని మిల్‍పిటాస్ స్వాగత్ హోటల్ లో వీక్షణం సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది.
సమావేశానికి శ్రీ వేణు ఆసూరి అధ్యక్షత వహించారు. సమావేశం లో ముందుగా శ్రీ సి.బి రావు & శ్రీమతి రమణ డిశంబర్ 14 న హైదరాబాదు లో ఆవిష్కరణ జరుపుకున్న శ్రీమతి ఓల్గా గారి "యశోబుద్ధ" నవలను  పరిచయం చేసారు. సిద్దార్థ, యశోధర ల దాంపత్య అవగాహన వివరణ, సిద్దార్థుని నిష్క్రమణ, గ్రామ పర్యటన, స్త్రీల బౌద్ధ మత ప్రవేశంపై సిద్దార్థుని నిరాకరణ, బుద్ధు ని నిర్యాణం, యశోధర, సిద్దార్థుల సంవాదం మున్నగు అంశాలను ప్రస్తావించారు. తరువాత సిద్ధార్థుని నిష్క్రమణ - అనుమతి ఊహాజనితమా? స్త్రీల మనోభావాలను ప్రతిబింబించే విధంగా రచన ఉన్నదా? బౌద్ధం కుటుంబాన్ని త్యజించమంటుందా? సన్యాసాన్ని బోధిస్తుందా? మొ||న ప్రశ్నలకు జవాబులిచ్చారు.
ఆ తరువాత హైదరాబాదు నుంచి వచ్చిన శ్రీమతి ఆర్.దమయంతి గారిని శ్రీ మోచెర్ల కృష్ణమోహన్ సభకు పరిచయం చేసారు. దమయంతి గారు తన కథ "బంతిపూల పడవమీద పోదాం పదవా" ను చదివారు. భార్య తన భర్తకు వ్రాసిన జాబులో మొత్తం కథ నడుస్తుంది. ఈ కొత్తదనాన్ని సభికులు తమ వ్యాఖ్యలతో మెచ్చుకున్నారు.
ఆ తరువాత కౌముది సంపాదకులు, కవి, కిరణ్ ప్రభ గారు "సాహితీ క్విజ్" కార్యక్రమంలో ఆసక్తికరమైన ప్రశ్నలతో ప్రశ్నావినోదం కావించారు.
తదుపరి తెలంగాణా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక ఆహ్వానితురాలిగా హైదరాబాదుకి వెళ్లిన కవయిత్రి డా|| కె.గీత అక్కడి విశేషాలు సభకు తెలిపారు.
ఆ తరువాత కవితా పఠనం, సభికుల పాటల కార్యక్రమం జరిగింది.
ఇందులో చిన్నారి ఈశా వరకూరు పుష్ప విలాపం నించి పద్యాలను చక్కటి గాత్రంతో పాడి వినిపించింది. శ్రీమతి ఛాయాదేవి, శ్రీ భువన్ తమ పాటలతో అలరించారు. కవితా పఠనంలో శ్రీ వరకూరు గంగాప్రసాద్, శ్రీ జి. చెన్నకేశవరెడ్డి, శ్రీ ఆర్. గోపాలరెడ్డి , డా|| కె.గీత, శ్రీ వెంకట రమణ మొ.న వారు కవితలు చదివారు. తర్వాత గీతామాధవి సభికులను సభకు పరిచయం చేసారు.
కార్యక్రమం యావత్తూ ఆసక్తిగా జరిగింది. సభ పూర్తయ్యక కూడా సభికులు పిచ్చాపాటి గావించారు. ఒకరినొకరు పరిచయం చేసుకొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ, శ్రీ రావు వేమూరి, శ్రీ వికాస్, శ్రీ అహ్మద్, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ పిల్లల మర్రి కృష్ణకుమార్, శ్రీ సతీష్ కుమార్ అద్దేపల్లి, శ్రీమతి ఉదయ లక్ష్మి, శ్రీమతి కోటేశ్వరి, శ్రీమతి షమ్షాద్, శ్రీమతి జహారా, శ్రీమతి తాయబా, శ్రీమతి శారద, శ్రీమతి కాంతి, శ్రీమతి ఉమ, శ్రీమతి అద్దేపల్లి ఉమాదేవి తదితర స్థానిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు.





http://sirimalle.com/issues/2018/02/vikshanam.html
http://www.koumudi.net/Monthly/2018/february/feb_2018_vyAsakoumudi_vikshanam.pdf
--------------

No comments:

Post a Comment